జమ్మూకశ్మీర్లోని ఉధంపూర్ జిల్లాలో భద్రతా దళాలు జరిపిన భారీ ఎన్కౌంటర్లో ఇద్దరు కరడుగట్టిన ఉగ్రవాదులు హతమయ్యారు. ఫిబ్రవరి 4, 2026న జరిగిన ఈ ఆపరేషన్ లో ఇద్దరు జైషే ఉగ్రవాదుల హతమైపోయారు.
జమ్మూకశ్మీర్ రాష్ట్రం ఉధంపూర్ జిల్లాలో భారత భద్రతా దళాలు ఉగ్రవాదులపై విరుచుకుపడ్డాయి. రామ్నగర్ సమీపంలోని జాఫర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ హోరాహోరీ ఎదురుకాల్పుల్లో జైషే మహమ్మద్ (JeM) సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను జవాన్లు మట్టుబెట్టారు.
జాఫర్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో జమ్మూకశ్మీర్ పోలీసులు, ఇండియన్ ఆర్మీ (వైట్ నైట్ కోర్ప్స్), మరియు సీఆర్పీఎఫ్ బలగాలు మంగళవారం సాయంత్రమే గాలింపు చర్యలు (కూంబింగ్) ప్రారంభించాయి. సుమారు 20 గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్లో భద్రతా దళాలు అత్యంత చాకచక్యంగా వ్యవహరించాయి.
మొదట జరిగిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది గాయపడి సమీపంలోని ఒక గుహలో దాక్కున్నాడు. అతనికి సహాయం చేయడానికి వచ్చిన స్థానిక ఉగ్రవాది కదలికలను గుర్తించిన సైన్యం, వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్ సాయంతో వారి ఆచూకీ కనుగొన్న జవాన్లు, గుహ ప్రవేశ ద్వారం వద్ద రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లను ప్రయోగించి ఇద్దరినీ హతమార్చారు.
హతమైన ఉగ్రవాదుల వివరాలు
మరణించిన వారిలో ఒకరు పాకిస్థాన్ జాతీయుడు కాగా, మరొకరు స్థానిక ఆపరేటర్ అని అధికారులు గుర్తించారు. వీరిలో జైషే మహమ్మద్ టాప్ కమాండర్ రుబానీ అలియాస్ అబూ మావియా కూడా ఉన్నట్లు సమాచారం. వీరు గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సైన్యం వెల్లడించింది.
భారీగా ఆయుధాలు స్వాధీనం
ఘటనా స్థలం నుండి సైన్యం అత్యాధునిక ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకుంది. వీటిలో:
M4 కార్బైన్ రైఫిల్
AK అస్సాల్ట్ రైఫిల్
పెద్ద మొత్తంలో మందుగుండు సామాగ్రి ఉన్నాయి.
ఈ విజయంతో ఉధంపూర్ ప్రాంతంలో పెను ప్రమాదం తప్పిందని భద్రతా దళాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఆ అటవీ ప్రాంతంలో ఇంకా ఎవరైనా ఉన్నారేమోనన్న అనుమానంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఇంకా ఉధంపూర్ వసూలు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు.
